Thursday, March 13, 2014

మంచు విష్ణు- మెహన్ బాబుల 'రౌడీ' రాగాలు.. తిరుపతిలో!

 
మంచు మోహన్ బాబు, విష్ణు ప్రధాన తారాగణంగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన చిత్రం 'రౌడీ'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెలాఖరున విడుదల కానుంది. ఈ సినిమా ఆడియో కార్యక్రమాన్ని ఈనెల 20న తిరుపతిలో నిర్వహించనున్నారు.

ఇందులో మోహన్‌బాబు సరసన జయసుధ నటించగా, విష్ణు సరసన శాన్వి నటించింది. ఈ చిత్రాన్ని రికార్డు స్థాయిలో అతి తక్కువ రోజుల్లో షూటింగ్ చేశారు. అదేవేగంతో ఈనెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి తిరుపతిలోని మోహన్ బాబు విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ప్రాంగణంలో ఈ నెల 20న గ్రాండ్‌గా ఈ వేడుకను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments:

Post a Comment